Trivikram Son: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలో దర్శకుల పిల్లలు దర్శకుడిగాను హీరోగాను సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి.అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు కాగా ఇందులో ఒక అబ్బాయికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తాజాగా తన తన భార్య సౌజన్య వెల్లడించారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన కుమారుడికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశానికి ఏ కెమెరా వాడారు ఏ లెన్స్ వాడారు అనే విషయాలను చాలా అలవోకగా చెప్పేస్తారని సౌజన్య వెల్లడించారు.ఇలా సౌజన్య చెప్పే మాటలను బట్టి చూస్తే తప్పకుండా త్రివిక్రమ్ కొడుకు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు దర్శకుల కుమారులు దర్శకులుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సందర్భాలు లేవు కానీ ఈ రికార్డును త్రివిక్రమ్ కొడుకు బ్రేక్ చేస్తారేమో చూడాలి. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…