అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్రమోడి తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో “భారతదేశంలోని మా స్నేహితులకు అమెరికా, వెంటిలేటర్లును విరాళంగా ఇంస్తుందని ప్రకటించడం మాకు గర్వంగా ఉంది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మోడి, మేము కలిసి పని చేస్తున్నాము. మేమిద్దరం కలిసి అజాత శత్రువు అయిన కరోనాను ఓడిస్తాం.” అంటూ ట్విట్ చేసారు డోనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ చేసిన ఈ ట్విట్ పై భారత్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే.. దీనిని ట్రంప్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఇండియాకు వెళ్లేందుకు యాపిల్ కంపెని సన్నాహకాలు చేస్తుంటే.. ఇండియాకు వెళితే ఆ కంపెనీకి పన్ను పోటు తప్పదంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. అదే సామయంలో అమెరికాకు వచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని చేసిన వ్యాఖల ద్వారా అయన భారత్ కు తీరని ద్రోహం చేస్తున్నారనే వాదన ఆర్దిక వేత్తలనుంచి వెలువడుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…