TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!
TSRTC: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీకి ఆదరణ పెరిగేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులపై భారం మోపేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బస్ పాస్ రెన్యూవల్ కు 20 రోజుల గడువు ముగిస్తే ప్రతీ విద్యార్థిపై రూ. 100 పెనాల్టీగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
కరోనా కారణంగా గతేడాది విద్యాలయాలు పెద్దగా నడవలేదు. సెప్టెంబర్ 1నుంచి తరగుతులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థులంగా బడి బాట పట్టారు. కాగా ఇటీవల థర్డ్ వేవ్ సందర్భంగా సంక్రాంతి సెలవులను గత నెల 8 నుంచి 30 వరకు విద్యాసంస్థలు మూసివేశారు. దీంతో 24 రోజులు కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి.
అయితే దాదాపు 20 రోజుల కన్నా ఎక్కువగా సెలవులు దాటడంతో.. బస్ పాస్ ల రెన్యూవల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. అదనంగా రూ. 100 చెల్లించడం విద్యార్థులకు కష్టంగా మారింది. ఒక్కక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బస్ పాస్ కలిగిన విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉన్నారు.
చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. ఇందులో నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులే.. బస్ పాసులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అదనంగా రూ. 100 చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ మాత్రం ఇది కొత్తగా పెట్టిన నిబంధన కాదని అంటుంది. అయితే గతంలో ఒక్క వేసవి సెలవుల్లో మాత్రమే.. 20 రోజుల కన్నా మించి సెలవులు వచ్చేవి. అయితే కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు విద్యాలయాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియని పరిస్తితి ఉంది. ప్రస్తుతం ఈ వివాదంపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఆర్టీసీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…