Tulja Bhavani reddy : రాజకీయాలలో ప్రత్యర్థులు ఒకరిమీద ఒకరు విమర్శలను ఆరోపనలను చేయడం కామన్. అయితే తెలంగాణ జనగామ రాజకీయాలలో మాత్రం తండ్రి మీద కూతురు అవినీతి ఆరోపణలను చేస్తూ పోలీసు స్టేషన్ మెట్లెక్కడంతో ఇద్దరి పంచాయితీ రచ్చకు చేరింది. తన సంతకం ఫోర్జరీ చేసి తన భూమిని లాక్కున్నాడంటూ జనగాం బిఆరెస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

మా నాన్న నయీమ్ కు 70 లక్షలు ఇచ్చాడు…
మొదట్లో సర్వేయర్ గా పనిచేసినపుడు భూముల విషయంలో లొసుగులు తెలుసుకున్న మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాక అధికారం అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డాడు. కొడుకు కోసం ఏమైనా చేసే మా నాన్న మొదటి భార్య విషయంలో చంపించడానికి అలాగే మరో ఆమెను పెళ్లి చేసుకునే విషయంలో నయీమ్ కు వేరేవాళ్లను బెదిరించడానికి 70 లక్షలు ఇచ్చాడు.

కొడుకు అంటే పిచ్చి, వాడి కోసం ఏదైనా చేస్తాడు. ఇక ఎక్కడ భూమి కనిపించినా ఆక్రమించడమే పని. కొందరు బాధితులు నా వరకు వచ్చారు. మీరైనా చెప్పండని చెప్పేవారు. కోడలు గర్భవతిగా ఉన్న సమయంలో సూసైడ్ ఎలా చేసుకుంది, మనవరాలు పై నుండి దూకి ఎలా చనిపోయింది. వీటన్నింటికీ సమాధానం దొరకదు అంటూ భవాని రెడ్డి తన తండ్రి మీద ఫైర్ అయ్యారు.


































