Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
గత మూడు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ చెబుతూనే ఉన్నారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన కూడా రాలేదు. ఇకపోతే తాజాగా ఈయన డెబ్యూ మూవీ గురించి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
ఇక ఇటీవల ఆషాడం ముగిసి మంచి రోజులు రావడంతో బాలకృష్ణ తన కుమారుడి సినిమా ముహూర్తానికి కూడా సమయం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 60 సంవత్సరాలు కావడంతో ఘనంగా సత్కరించనున్నారు.
ఖుషీ కపూర్..
ఇక అదే రోజున తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కూడా బాలయ్య అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి వారసురాలు ఖుషి కపూర్ నటించబోతున్నారని వార్త సంచలనంగా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది ఇదే నిజమైతే ఇక ఈ సినిమాకు తిరుగుండదు. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. చిన్న కుమార్తె కూడా మరో నందమూరి వారసుడుకి జోడి కట్టబోతున్నారని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…