చట్టాలు ఎన్ని చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి మహిళ బయట అడుగుపెట్టిందంటే.. తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అమ్మాయి అయితే చాలు ఎలాంటి వాయి వరుసలు గుర్తుకురావు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటిదే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో ఓ వివాహిత నివాసం ఉంటుంది.
ఆమెపై ఇద్దరు అన్నాదమ్ముళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె స్నానం చేస్తుండగా.. ప్రవీణ్ అనే యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించాడు.
తన కామ కోరిక తీర్చాలని ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రవీణ్ సోదరుడు గిరిదర్ కూడా ఆమెను ఇలానే బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె తనపై వారిద్దరు లైంగిక దాడి చేసి.. వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…