Indian wedding hands with gold
పెళ్లి జరిగిన తర్వాత భార్య భర్తల మధ్య అన్యోన్యత, శారీరిక సంబంధం పెరగడం సాధారణం. కానీ ఓ జంటకు పెళ్లి జరిగి రెండు నెలలు గడిచినప్పటికీ భర్త తన భార్యతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తన భార్యపై భర్తకు పలు అనుమానాలు తలెత్తడంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. అయితే వైద్య పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత తన భార్య అసలు మహిళ కాదని తెలుసుకున్న భర్త ఖంగుతిన్న ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఒక హిజ్రా కు లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి మోసం చేసి కాన్పూర్ నగర్ కి చెందిన యువకుడికి శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతికి ఏప్రిల్ 28వతేదీన వివాహం చేశారు. వీరి వివాహం తర్వాత వరుడు వధువుతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తన భార్య లింగ మార్పిడి చేయించుకోవడం వల్లే తన జననాంగాలు పూర్తిగా వృద్ధి చెందడం లేదని గుర్తించిన ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు ఆమె మహిళ కాదని తన ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.తను మహిళ కాదని తెలిసినప్పటికీ మోసం చేసి తన కిచ్చి పెళ్లి చేశారని భర్త అత్తమామల పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అదేవిధంగా తన భార్య, అత్తమామలు, పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…