Upasana: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈమె గిరిజనుల సంక్షేమానికి ఎంతో పెద్దపీట వేస్తూ ఉంటారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఉపాసన తన కుమార్తె నామకరణ మహోత్సవంలో భాగంగా గిరిజనల సాంప్రదాయ వేడుకలలో తన కుమార్తెకు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై గిరిజనల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి సంచలనం అయినటువంటి నిర్ణయాల పట్ల ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేసి స్వయంగా గవర్నర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన తమిళ సైతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తమిళ సైకి కృతజ్ఞతలు…
ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఉపాసన గిరిజనుల సంక్షేమం కోసం గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తన మనసుని ఎంతగానో హత్తుకున్నాయని తెలిపారు. ఇలా గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి గవర్నర్ గారికి కృతజ్ఞతలు అంటూ ఈ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆమెకు సీతారామ లక్ష్మణుల ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కూడా అందజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…