Upasana: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈమె గిరిజనుల సంక్షేమానికి ఎంతో పెద్దపీట వేస్తూ ఉంటారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఉపాసన తన కుమార్తె నామకరణ మహోత్సవంలో భాగంగా గిరిజనల సాంప్రదాయ వేడుకలలో తన కుమార్తెకు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై గిరిజనల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి సంచలనం అయినటువంటి నిర్ణయాల పట్ల ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేసి స్వయంగా గవర్నర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన తమిళ సైతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తమిళ సైకి కృతజ్ఞతలు…
ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఉపాసన గిరిజనుల సంక్షేమం కోసం గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తన మనసుని ఎంతగానో హత్తుకున్నాయని తెలిపారు. ఇలా గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి గవర్నర్ గారికి కృతజ్ఞతలు అంటూ ఈ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆమెకు సీతారామ లక్ష్మణుల ఆంజనేయస్వామి చిత్రపటాన్ని కూడా అందజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…