V S Roopa Lakshmi : తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్ల తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రూప లక్ష్మి. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘నీది నాది ఒకటే కథ’ సినిమాలో హీరో శ్రీ విష్ణు తల్లి పాత్రలో నటించడమే కాకుండా కామెడీ పంచులతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ దాదాపుగా 50 సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన నార్తనశాల, ఎక్ మినీ కథ, క్రాక్, సరిలేరు మీకెవ్వరు, మిడిల్ క్లాస్ అబ్బాయి మొదలైన సినిమాలలో నటించింది వి ఎస్ రూప లక్ష్మి.

ఆరోజు చాలా బాధ పడ్డాను…
సినిమాలలోనే కాకుండా తెలుగు బుల్లితెర మీద కూడా అలరించింది రూప లక్ష్మి. కొన్ని సీరియల్స్ లో కూడా నటించి అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం సినిమాల కారణంగా సీరియల్స్ కు దూరంగా వుంది. తాజాగా రూప లక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఈమె తాను చిన్నప్పటినుండి పడ్డ కష్టాలు, చదువు, పెళ్లి ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. అయితే చిన్నప్పటినుండి సినిమాలలో నటించాలని ఉండేదని దానికి స్ఫూర్తి చిరంజీవి గారే అని చెప్పుకొచ్చారు. కుటుంబ కారణాల వలన హైదరాబాద్ కి మారడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారు.

తన తమ్ముడి స్నేహితుడి ద్వారా మొదటి సారి అవకాశం వచ్చిందని, అయితే తరువాత అవకాశాల రాక చిన్న చిన్న ఇబ్బందులు సహజమే అని చెప్పుకొచ్చారు. అయితే రెండు సినిమాలకు మాత్రం ఈ పాత్ర ఖచ్చితంగా నువ్వే చేస్తున్నావ్ అని చెప్పి, తీరా సెట్స్ కి వెళ్ళాక నువ్వు అవసరం లేదు వేరొకరు చేస్తున్నారు అని చెప్పాడంతో చాలా బాధ అనిపించింది అని చెప్పుకొచ్చారు. తరువాత ఇలాంటివి ఇండస్ట్రీలో సాధారణం పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అని ఇతరులు చెప్పడంతో ఆ సంగతి మర్చిపోయాను అని చెప్పుకొచ్చారు.



























