Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందా? ఆయన భార్య అర్ధరాత్రి ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు వంశీకి ఏమైంది?
రాజకీయాల్లో ఆరితేరిన నేతగా పేరు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతున్నారు. బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం గడపాల్సి రావడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వంశీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన దాదాపు 20 కేజీల బరువు తగ్గారట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు పరీక్షలు చేయగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. CT స్కాన్, ఊపిరితిత్తులకు సంబంధించిన టెస్టులు కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే, తాజాగా వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కంకిపాడు పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆయన ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని, స్టేషన్లో వాంతులు కూడా చేసుకున్నారని డాక్టర్లు తెలిపారు. దీంతో వంశీ భార్య పంకజశ్రీ అర్ధరాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
భర్త ఆరోగ్యంపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శ్వాసకోస సమస్యలు, కాళ్ల వాపు కారణంగా వంశీని హాస్పిటల్కు తీసుకెళ్లారని, హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉందని చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఇన్హెలర్ ఇచ్చారని తెలిపారు. వంశీకి వెన్ను నొప్పి సమస్య కూడా ఉందని, కింద పడుకోవడం ఇబ్బందిగా ఉండటంతో మంచం కోసం పిటిషన్ వేస్తే కోర్టు బల్ల మంజూరు చేసిందని ఆమె వెల్లడించారు. తన ఆరోగ్య సమస్యలను వంశీ స్వయంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారని, ఆరోగ్య సమస్యలపై పిటిషన్ వేయమని కోర్టు సూచించిందని పంకజశ్రీ తెలిపారు.
మంగళవారం నాడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్థన్ను కిడ్నాప్ చేయడం, దాడి చేయడం, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారనే ఆరోపణలతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిబ్రవరిలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చినా.. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఇంకా జైలులోనే ఉండాల్సి వస్తోంది. ఆ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. వంశీపై మొత్తం 6 కేసులు నమోదు కాగా, 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ, కొత్త కేసులు వెంటాడుతుండటంతో ఆయన జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వంశీని ప్రభుత్వం కక్షపూరితంగా చూడటం సరికాదని ఆయన అన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినందునే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక…