తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ సాధించాడు ఇళయదళపతి విజయ్. ఐతే, విజయ్ దాదాపు పదేళ్ల నుండే సౌత్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు.కానీ, విజయ్ చేసిన ప్రయత్నాలలో ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడిప్పుడే అతనికి తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంది. అది గమనించిన ఈ హీరో ఆ మార్కెట్ కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
తెలుగులో మార్కెట్ పెరగాలి అంటే.. తెలుగు పై మరింత ఫోకస్ పెట్టాలి, అందుకే విజయ్ ప్రస్తుతం తెలుగు పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.తమిళ హీరోల్లో అందరికన్నా తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో ‘కార్తీ’నే. మొదట తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తెలుగులో ‘ఊపిరి’ అనే సినిమా చేశాడు. కేవలం ఆ సినిమా వల్ల కార్తీకి తెలుగులో మార్కెట్ మరింతగా పెరిగింది.
అప్పటికే తెలుగువారికి మరింతగా చేరువైన తన అన్నయ్య సూర్య కంటే కూడా, కార్తీ ‘ఊపిరి’తో తెలుగులో ఇంకా ఎక్కువ మార్కెట్ అలాగే స్టార్ ఇమేజ్ ను సాధించాడు.మొత్తానికి కార్తీనే ఫాలో అవ్వడానికి సిద్ధం అయ్యాడు విజయ్. తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ రావాలి అన్నా, అలాగే తెలుగులో కూడా తనకు స్టార్ ఇమేజ్ రావాలి అన్నా, తానూ కూడా కార్తీలాగే డైరెక్ట్ తెలుగు స్టార్ మేకర్స్ తో సినిమా చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడు.
అందులో భాగంగా ఇటీవల నిర్మాత దిల్ రాజుతో పర్సనల్ గా చర్చలు కూడా జరిపాడు. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.ఆ సినిమాకి సంబంధించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏమిటంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా సినిమా రాబోతుంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి, విజయ్ ను కలిసి కథ చెప్పాడు. విజయ్ కి కథ నచ్చిందని టాక్..ఇక తొందర్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని.. అంతేకాదు తెలుగు,తమిళ భాషల్లో బై లింగ్వల్ మూవీ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం…!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…