Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన పదేళ్ల సినీ కెరియర్ లో ఎదుర్కొన్న సంఘటనలను తెలియజేశారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిందని అయితే ఈ పది సంవత్సరాలలో తాను ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. కెరియర్ మొదట్లో చాలామంది తనని బాడీ షేమింగ్ చేశారని నటనకు తాను సరిపోనంటూ ఎంతో అవమానించారని వెల్లడించారు.
బొద్దుగా ఉన్నావు ఫేసులో ఆకర్షణ లేదు అంటూ ఎంతోమంది తనకి అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారంటూ ఈమె ఆవేదన చెందారు. అయితే వాటి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.ఇలా అవమానాలు తిరస్కారాలు నన్ను ఆపలేదని పదేళ్ల కెరియర్ లోనే 45 సినిమాలలో నటించానని ఈమె తెలిపారు.
హీరోయిన్ గా మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోను నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నానని అయితే తనకు ఎక్కువగా విలన్ పాత్రలు మంచి పేరు తీసుకువచ్చాయని వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించారు. ఈ పది సంవత్సరాల నా సినీ కెరియర్ లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి అనుభూతికి లోనవుతున్నానని ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈమె తెలుగులో క్రాక్ సినిమాతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం నాంది యశోద వంటి సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…