Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన పదేళ్ల సినీ కెరియర్ లో ఎదుర్కొన్న సంఘటనలను తెలియజేశారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిందని అయితే ఈ పది సంవత్సరాలలో తాను ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. కెరియర్ మొదట్లో చాలామంది తనని బాడీ షేమింగ్ చేశారని నటనకు తాను సరిపోనంటూ ఎంతో అవమానించారని వెల్లడించారు.
బొద్దుగా ఉన్నావు ఫేసులో ఆకర్షణ లేదు అంటూ ఎంతోమంది తనకి అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారంటూ ఈమె ఆవేదన చెందారు. అయితే వాటి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.ఇలా అవమానాలు తిరస్కారాలు నన్ను ఆపలేదని పదేళ్ల కెరియర్ లోనే 45 సినిమాలలో నటించానని ఈమె తెలిపారు.

Varalakshmi Sarathkumar: పదేళ్ల కెరియర్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను…
హీరోయిన్ గా మాత్రమే కాకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోను నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నానని అయితే తనకు ఎక్కువగా విలన్ పాత్రలు మంచి పేరు తీసుకువచ్చాయని వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించారు. ఈ పది సంవత్సరాల నా సినీ కెరియర్ లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి అనుభూతికి లోనవుతున్నానని ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈమె తెలుగులో క్రాక్ సినిమాతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం నాంది యశోద వంటి సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.
































