Prabhas – Kriti Sanon: ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఏదైనా వార్తలు వస్తున్నాయి అంటే అది కేవలం తన పెళ్లి గురించి మాత్రమే.ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన పెళ్లి విషయం గురించి తరచు వార్తల్లో నిలుస్తుంటారు.ప్రభాస్ కి ఇప్పటికే 42 సంవత్సరాల వయసు కావడంతో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల తరచూ తన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రభాస్ అనుష్క ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు దీంతో చనువుగా ఉండడమే కాకుండా పలు సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనుష్క పూర్తిగా కొట్టి పారేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కృతి సనన్ తో కలిసి నటించారు.
అయితే వీరిద్దరి గురించి పలుమార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడమే కాకుండా తాజాగా హీరో వరుణ్ ధావన్ కృతి సనన్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధావన్ కృతి జంటగా నటించిన భేడియా సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కరణ్ జోహార్ ప్రశ్నిస్తూ మీ గుండెల్లో కృతి ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానం చెబుతూ ఆమె వేరొక హీరో గుండెల్లో ఉందని,ప్రస్తుతం ఆయన ముంబైలో కాకుండా దీపికా పదుకొనేతో కలిసి వేరే ప్రాంతంలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ విధంగా వరుణ్ సమాధానం చెబుతుంటే కృతి మాత్రం నవ్వుతూ వద్దు అంటూ సైగలు చేస్తున్నారు.దీన్నిబట్టి చూస్తుంటే ప్రభాస్ దీపికా పదుకొనేతో కలిసి ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన ప్రభాస్ కృతి సనన్ రిలేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…