Veera Shankar : దర్శకుడు వీర శంకర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర మొదట సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత 1997 లో వచ్చిన ‘హలో ఐ లవ్ యు’ సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశన్ని సంపాదించాడు. ఈయన తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ సినిమా వల్ల చాలా నష్టపోయాను…
దర్శకుడు వీర శంకర్ కన్నడలో పునీత్ రాజకుమార్ హీరోగా దర్శకత్వం వహించిన ‘నమ్మ బసవ’ సినిమా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే రీమేక్ గా తీసిన ‘అంతు ఇంతు ప్రీతీ బంతు’ సినిమాలు మంచి విజయాలను అందించాయి. అయితే తెలుగులో మాత్రం ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా నిర్మాత కారణంగా బాగా నష్టపోయాను అని ఇంటర్వ్యూలో చెప్పారు. 2018లో వచ్చిన ‘యువ రాజ్యం’ సినిమా నష్టాలను మిగిల్చిందని చెప్పుకొచ్చారు.
సినిమా మొదలు పెట్టాక వారానికే నిర్మాత డబ్బులు అపుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి మీరు కొంచం మేనేజ్ చేయండి అని చెప్పడంతో తన సొంత డబ్బుని వాడటం జరిగిందట. అయితే సినిమా సగ భాగం పూర్తి అయినప్పటికీ కూడా నిర్మాత డబ్బులు సర్దుబాటు చేయకపోవడంతో, సినిమా నిర్మాణం బాధ్యత తానే తీసుకొని సినిమా మధ్యలో ఆపకూడదని తానే అప్పు చేసి మరి పూర్తి చేసాడట. అయితే సినిమా ఆడక పోయినా సాటిలైట్ హక్కులకు సంబందించిన డబ్బులు అయినా వస్తాయ్ అన్న నమ్మకంతో ముందుకు వెళ్లగా అదే సమయంలో జెమినీ టీవీలో స్కాములు జరగడంతో అవి రాలేదని దాని వల్ల ఇల్లు, పొలాలు అమ్ముకొని అప్పు తీర్చాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…