Featured

Venkaiah Naidu : సినిమాల పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..

Venkaiah Naidu : తాజాగా శిల్పకళావేదికలో జరిగిన సిరివెన్నెల జయంతి వేడుకలలో మన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పాల్గొన్నారు. తానా ప్రపంచ వేదిక, సిరివెన్నెల కుటుంబసభ్యులు సంయుక్తంగా కలసి శిల్పకళావేదికలో సిరివెన్నెల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సిరివెన్నెల గురించి మాట్లాడుతూ…సిరివెన్నెల నిశ్శబ్ద పాటల విప్లవం అని ఆయన కొనియాడారు. రోజు తాను తెల్లవారుజామున నిద్ర లేచి మొదట అన్నమాచార్య కీర్తనలు ఇంకా సిరివెన్నెల పాటలు వినిన తర్వాతే నా రోజు ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు….

సిరివెన్నెల జయంతి వేడుకలలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలను గుర్తు చేసుకున్న ఆయన మాయాబజార్ సినిమా అప్పటి లోనే 100 రోజులు ఆడింది అని తెలియజేశారు. ప్రస్తుత సినిమాలు విడుదలైన తర్వాత ఫస్టు కూడా ఉంటుందో లేదో అన్నట్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాలలో డబల్ మీనింగ్ కంటే ముందు అసలు మీనింగ్ ఏంటో అర్థమయ్యేలా చెప్పాలి అని పేర్కొన్నారు. సినిమాలు తీసే దర్శకులు హీరో హీరోయిన్లు ముందుగా వాల్ల సినిమాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి చూసి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వచ్చే సినిమాలు కొన్ని చూడటానికే వెగటు పుట్టిస్తూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో సినిమాల పరిస్థితిని ఆయన వివరిస్తూ వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు ఇప్పటి సినిమాలు ఉన్నాయని తెలియజేసారు. ఈ సినిమాల తీరును చిత్ర పరిశ్రమ తప్పకుండ సరిద్దిదుకోవాలని ఆయన సూచించారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

25 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

20 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

20 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago