Venkaiah Naidu : తాజాగా శిల్పకళావేదికలో జరిగిన సిరివెన్నెల జయంతి వేడుకలలో మన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పాల్గొన్నారు. తానా ప్రపంచ వేదిక, సిరివెన్నెల కుటుంబసభ్యులు సంయుక్తంగా కలసి శిల్పకళావేదికలో సిరివెన్నెల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సిరివెన్నెల గురించి మాట్లాడుతూ…సిరివెన్నెల నిశ్శబ్ద పాటల విప్లవం అని ఆయన కొనియాడారు. రోజు తాను తెల్లవారుజామున నిద్ర లేచి మొదట అన్నమాచార్య కీర్తనలు ఇంకా సిరివెన్నెల పాటలు వినిన తర్వాతే నా రోజు ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు….
సిరివెన్నెల జయంతి వేడుకలలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలను గుర్తు చేసుకున్న ఆయన మాయాబజార్ సినిమా అప్పటి లోనే 100 రోజులు ఆడింది అని తెలియజేశారు. ప్రస్తుత సినిమాలు విడుదలైన తర్వాత ఫస్టు కూడా ఉంటుందో లేదో అన్నట్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాలలో డబల్ మీనింగ్ కంటే ముందు అసలు మీనింగ్ ఏంటో అర్థమయ్యేలా చెప్పాలి అని పేర్కొన్నారు. సినిమాలు తీసే దర్శకులు హీరో హీరోయిన్లు ముందుగా వాల్ల సినిమాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి చూసి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వచ్చే సినిమాలు కొన్ని చూడటానికే వెగటు పుట్టిస్తూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో సినిమాల పరిస్థితిని ఆయన వివరిస్తూ వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు ఇప్పటి సినిమాలు ఉన్నాయని తెలియజేసారు. ఈ సినిమాల తీరును చిత్ర పరిశ్రమ తప్పకుండ సరిద్దిదుకోవాలని ఆయన సూచించారు.






























