Venkatesh: దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ గురించి తెలియనివారు ఉండరు. ఎన్నో దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్3 సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో కూడా వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా కథని మలుపు తిప్పే కీలక పాత్రలో వెంకటేష్ 15 నిమిషాల పాటు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తమిళ భాషలో మంచి హిట్ అయిన ‘ఓ మై కడువులే’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసి ‘ఓరి దేవుడా’ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకి మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తునే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడిగా మితిలా పార్కర్ నటించింది. అంతే కాకుండా ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా తాజాగా విక్టరీ వెంకటేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమాలలో ఫుల్ లెన్త్ పాత్రలో నటించినందుకు వెంకటేష్ 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం వెంకటేష్ 5 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఐదు రోజుల షూటింగ్ కోసం వెంకటేష్ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. వెంకటేష్ రెమ్యురేషన్ మరీ ఎక్కువగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…