1978 ప్రాణంఖరీదు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కోట శ్రీనివాసరావు అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకు లో ఒక ఉద్యోగిగా పని చేసేవారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవాడు. ప్రాణం ఖరీదు లో క్లైమాక్స్ లో వచ్చే చిన్న వేషం వేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లారు.
ఒక నాటకంలో దర్శకుడు జంధ్యాల కోట శ్రీనివాసరావు ను చూసి మూడు ముళ్ళు అనే చిత్రానికి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరో నాటకం రవీంద్రభారతిలో జరుగుతుండగా కోట శ్రీనివాస్ రావు స్టేజి మీద చూసి తను తీయబోయే ప్రతిఘటన సినిమా లో కాశీ పాత్రను ఇవ్వాలని దర్శకుడు టి. కృష్ణ అనుకున్నారు.
ప్రతిఘటన లో వేసిన కాశీ అనే రాజకీయ నాయకుడి పాత్ర కోట శ్రీనివాసరావు కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు వెనుతిరిగి చూడలేదు. జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంలో తెలంగాణ మాండలికంలో రామాయణం స్టోరీ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట చిత్రంలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు చేసిన నటన కొత్తగా ఉంటుంది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో గురు నారాయణ అనే విలన్ పాత్రలో తెలంగాణ స్లాంగ్ లో చెప్పే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ అనే చిత్రంలో చిన్నప్పటి నుంచి నేరాలు చేస్తూ రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగానని తెలంగాణ మాండలికంలో చెప్పే సంభాషణలు నభూతో న భవిష్యత్ గా ఉంటాయి. తలపై ఒక్క వెంట్రుకపోస లేకుండా పూర్తి గుండు ముఖంతో కనిపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిస్తాడు. అయితే
ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తన కెరీర్లో విభిన్నమైన పాత్రలను ధరించానని అందులో తెలంగాణ మాండలికంలో చెసిన పాత్రలు చాలా పేరు తీసుకు వచ్చాయని గణేష్ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ చెప్పి కోట శ్రీనివాసరావు తన ఇంటర్వ్యూ ముగించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…