Vijay Antony: విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో ఈ సినిమా తర్వాత తాను నటించిన సినిమాలన్నింటినీ కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న బిచ్చగాడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
మలేషియాలో కొన్ని యాక్షన్స్ అన్ని వేషాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈయన ప్రమాదానికి గురి కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కోమాలోకి వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఈయన ఆరోగ్యం గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు విజయ్ ఆంటోనీ స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన ప్రమాదం జరిగిన తర్వాత మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హాస్పిటల్ బెడ్ పై నుంచి థమ్స్ అప్ ఫోటోని షేర్ చేస్తూ తనకు మలేషియాలో ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో తన దవడ ముక్కు భాగం గాయాలు పాలయ్యాయని తెలిపారు. అయితే తనకు సర్జరీ పూర్తి అయిందని తాను క్షేమంగా ఉన్నానని ఈయన తెలియజేశారు. తొందర్లోనే మీ అందరితో మాట్లాడతానని విజయ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు.
ఈ విధంగా ప్రమాదం తర్వాత మొదటిసారి విజయ్ స్వయంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయడంతో ఇన్ని రోజులు తన గురించి వచ్చినటువంటి వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తాను క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…