Vijay Sai Reddy: ఏపీలో ప్రస్తుతం లిక్కర్ సామ్ కేసు దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా కొంతమంది పెద్దలు చిక్కుల్లో పడబోతున్నారని తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కసి రెడ్డి ఇల్లు ఆఫీసులలో రెండు రోజులపాటు సీట్ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా మరొక కీలక నేత ఆయన విజయసాయిరెడ్డికి నోటీసులను జారీ చేశారు.
వైసీపీ పార్టీ నుంచి మాత్రమే కాకుండా రాజకీయాల నుంచి తప్పకున్న విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈనెల 18వ తేదీ విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా అధికారులకు ఏ విధమైనటువంటి ఆధారాలు దొరికాయో తెలియదు కానీ అధికారులను మాత్రం విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో వైసీపీ పెద్ద నేతలందరికీ వెన్నులో వణుకు పుడుతుందని తెలుస్తోంది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బంధువు అంతేకాకుండా ఒకప్పుడు ఐటీ సలహాదారుడుగా కూడా పనిచేశారు ఈ క్రమంలోనే సోమవారం ఈయన ఇల్లు ఆఫీసులో ఈయన బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 15 చోట్ల రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన అధికారులకు కీలకమైన ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.
ఇలా కీలక ఆధారాలు దొరకడంతో సిట్ అధికారులు మరొక అడుగు ముందుకు వేసి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం విచారణకు రావాలి అంటూ నోటీసులను జారీ చేశారు. ఈనెల 18 ఉదయం 11 గంటలకు అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి కాకినాడ సీ పోర్ట్ కు సంబంధించి విచారణకు హాజరవుతున్న విషయం తెలిసినదే తాజాగా లిక్కర్ స్కామ్ లో సైతం విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపడంతో ఇది ఈయనకు ఊహించని షాక్ అనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…