Vijay Sai Reddy: ఏపీలో ప్రస్తుతం లిక్కర్ సామ్ కేసు దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా కొంతమంది పెద్దలు చిక్కుల్లో పడబోతున్నారని తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కసి రెడ్డి ఇల్లు ఆఫీసులలో రెండు రోజులపాటు సీట్ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా మరొక కీలక నేత ఆయన విజయసాయిరెడ్డికి నోటీసులను జారీ చేశారు.

వైసీపీ పార్టీ నుంచి మాత్రమే కాకుండా రాజకీయాల నుంచి తప్పకున్న విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈనెల 18వ తేదీ విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా అధికారులకు ఏ విధమైనటువంటి ఆధారాలు దొరికాయో తెలియదు కానీ అధికారులను మాత్రం విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో వైసీపీ పెద్ద నేతలందరికీ వెన్నులో వణుకు పుడుతుందని తెలుస్తోంది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బంధువు అంతేకాకుండా ఒకప్పుడు ఐటీ సలహాదారుడుగా కూడా పనిచేశారు ఈ క్రమంలోనే సోమవారం ఈయన ఇల్లు ఆఫీసులో ఈయన బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 15 చోట్ల రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన అధికారులకు కీలకమైన ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.
ఇలా కీలక ఆధారాలు దొరకడంతో సిట్ అధికారులు మరొక అడుగు ముందుకు వేసి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం విచారణకు రావాలి అంటూ నోటీసులను జారీ చేశారు. ఈనెల 18 ఉదయం 11 గంటలకు అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి కాకినాడ సీ పోర్ట్ కు సంబంధించి విచారణకు హాజరవుతున్న విషయం తెలిసినదే తాజాగా లిక్కర్ స్కామ్ లో సైతం విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపడంతో ఇది ఈయనకు ఊహించని షాక్ అనే చెప్పాలి.





























