Featured

Vilan Madhusudhan Rao : పూరీ జగన్నాథ్ కి మా ఆవిడ రికమండ్ చేస్తానంటే వద్దన్నాను….మాది ప్రేమ పెళ్ళో లేక పెద్దలు కుదుర్చిన పెళ్ళో నాకే తెలియదు…: విలన్ మధుసూదన్ రావు

Vilan Madhusudhan Rao : చక్రవాకం సీరియల్ లో జేమ్స్ గా సుపరిచితులైన తెలుగు నటుడు మధుసూదన్ రావు గారు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు. అయితే తెలుగులో దేవా కట్ట తీసిన ఆటో నగర్ సూర్య సినిమలో పూర్తి విలన్ గా నటించిన మధుసూదన్ గారు తెలుగులో ఆశించినన్ని అవకాశలు అందుకోలేదు. ఇక మధుసూదన్ గారి భార్య బుల్లితెర నటి శృతి. రుతురాగాలు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ తో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఉన్నారు. ఇక శృతి గారి గురించి అలానే తన కెరీర్ గురించి మధుసూదన్ గారు ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

పూరీ తెలుసు అయిన అవకాశాలు ఇవ్వలేదు….

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎందుకనో అవకాశాలు అంతగా రాలేదంటూ చెప్పిన మధుసూదన్ రావు గారు. దేవకట్ట సినిమా ఆటో నగర్ సూర్య విలన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాలో నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మంచి అవకాశలతో వెళ్తున్న మధుసూదన్ గారు పూరీ నాకు మంచి స్నేహితుడు భయ్య అనే పిలుస్తాను కానీ ఎందుకనో తన సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే నా భార్య కు పూరీ కుటుంబం బాగా క్లోజ్ అలా తాను నేను రికమెండ్ చేయనా అని అడిగితే వద్దని చెప్పేసాను. తన స్నేహితుడినే నేను బాగా నటిస్తున్నానని తెలుసు మరీ ఎందుకు అడగటం అని అడగలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ కి పిలిచి రెండు రోజుల షూటింగ్ అని చెప్పాడు. చిన్న క్యారెక్టర్ అని ఆలోచిస్తుంటే పూరీ నువ్వు నన్ను నమ్ము ఈ క్యారెక్టర్ నీకు ప్లస్ అవుతుంది అన్నాడు.

ఆ సినిమా తరువాత అందరు ‘ కాకా’ అని పిలవడం మొదలు పెట్టారు అంటూ మధుసూదన్ రావు ఆయన కెరీర్ గురించి పంచుకున్నారు. ఇక ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ నాది ప్రేమ వివాహమో పెద్దలు కుదుర్చిన పెళ్ళో ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు అలా అయిపోయింది అంటూ తెలిపారు. రుతురాగాలు సీరియల్ టైం కి శృతి తెలిసిన పెద్దగా పరిచయం లేదు. అయితే చక్రవాకం సీరియల్ చేసే సమయంలో శృతి హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది. అలా మళ్ళీ కలిసాను తానే ఫోన్ చేసి తనను తాను పరిచయం చేసుకుని మీరు చాలా బాగా నటిస్తున్నారంటూ చెప్పింది. అలా ఏర్పడిన పరిచయం ఎలా పెళ్లయిందో అంత డ్రామటిక్ గా అయిపోయింది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

11 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

14 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

17 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

17 hours ago