Vishnu Priya: మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతా… తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయినా విష్ణు ప్రియ!

Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు విష్ణు ప్రియ యాంకర్ గా కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలు చేసిన అనంతరం ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఇకపోతే విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఇలా తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ విష్ణు ప్రియ చేసినటువంటి పోస్టులు అందరినీ ఎంతగానో కలిచి వేసాయి. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రియమైన అమ్మకు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరినీ వారి తల్లులతో ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఇందులో రాకింగ్ రాకేష్ నూకరాజు ఒక స్కిట్ చేశారు. ఆ కొడుకులు ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల తన తల్లి చనిపోతుంది ఇలా తల్లి చనిపోవడంతో తమవల్లే చనిపోయిందని ఆ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తారు.

Vishnu Priya: నీకు కూతురుగానే పుడతాను…


ఈ సన్నివేశం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ సన్నివేశం చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతానమ్మా ఐ లవ్ యు సో మచ్ అమ్మ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే విష్ణు ప్రియని చూసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.