Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరు. ఇది ఇలా ఉంటే గత ఏడాది వాళ్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దశరత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.
వచ్చేనెల అనగా ఫిబ్రవరి 1 నుంచి విశ్వంభర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు చిరంజీవి. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు, అది వైరల్ అయింది కూడా. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఓవర్ సీస్ రైట్స్ ని రికార్డ్ ప్రైస్ కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్. ఈ క్రమంలో ఈ భారీ చిత్రం ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు రికార్డు ధరకు అమ్ముడయ్యాయట.
విజువల్ వండర్ లా విశ్వంభర మూవీ..
కాగా ఇది చిరంజీవి కెరీర్ లోనే రికార్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. సరిగమ సినిమా ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో VFX వర్క్స్ చాలా ఉన్నాయి. విశ్వంభర విజువల్ వండర్ లా ఉండబోతుంది. ఈ చిత్రం కథ మూడు లోకాల్లో తిరుగుతుందట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ మొదట అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని భావించారట. దాంతో విశ్వంభర అనే టైటిల్ ని పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…