రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుచేస్తాం_ సీఎస్

కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని సరిచేస్తామని వెల్లడించారు. ఆర్థిక సాయం తో ఎలాంటి స్కీమ్ తీసుకుంటారో పర్యవేక్షిస్తామని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

కాగా హుజరాబాద్ లో సర్వే చేసి వివరాలు సేకరించామని రాహుల్ బొజ్జా తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత సాయం మంజూరు చేస్తామని రాహుల్ బొజ్జ చెప్పుకొచ్చారు.