Movie News

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. ప్రకటన చేసిన స్టార్ ప్రొడ్యూసర్..?

భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం. అలాంటి ఈ లెజెండరీ లీడర్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది .

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు రావు బతికి ఉన్న సమయంలో.. ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవలు తతితర విషయాలను ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ రూపురేఖలను మార్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి అంశాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అతడి జీవితంలో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన అల్లు అరవింద్.. పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.

గతంలో వినయ్ సీతాపతి‘హాఫ్ లయన్’ పేరుతో పీవీ జీవిత కథను పుస్తకం రూపంతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝా దర్శకత్వం వహించనున్నారు . ఈ సిరీస్ తెలుగు , హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి రానుంది. దీనిలో నటించే వారి వివరాలు.. సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago