ప్రస్తుతం దేశంలోని చాలామంది ప్రజలు ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. ఏ పనినైనా వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు, వేగంగా ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి తినే తిండి విషయంలో కూడా వేగంగా పూర్తి చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే దేశంలోని వైద్య నిపుణులు మాత్రం వేగంగా తిండి తినడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని… అలా తింటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్లు అవుతున్నారని చెబుతున్నారు.
నెమ్మదిగా తింటే మాత్రమే తిన్న ఆహారం వల్ల శరీరానికి ప్రయోజనం చేకూరుతుందని బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఎవరైతే వేగంగా భోజనం తింటారో వారు కడుపు ఉబ్బరం సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే కడుపు ఉబ్బరం సమస్యతో ఎక్కువ రోజులు బాధ పడతారో వారు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వేగంగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఆహారం కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే నిదానంగా తింటారో వాళ్లు తక్కువ బరువు ఉంటారని.. ఎవరైతే వేగంగా తింటారో వాళ్లు ఎక్కువ బరువు ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తీసుకున్న వారిలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఉంటుంది.
అందువల్లే శాస్త్రవేత్తలు సైతం భోజనం నెమ్మదిగా తినాలని సూచిస్తుంటారు. భోజనం చేసే సమయంలో టీవీకు, మొబైల్ కు దూరంగా ఉంటే ఆహారాన్ని తగినంత తీసుకోవడంతో పాటు శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అలా కాకుండా తిండి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…