ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ కు బాగా డిమాండ్ ఏర్పడింది.మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ డోసు లభించకపోవడంతో రెండు వేరువేరు కంపెనీలకు చెందిన డోస్ లు తీసుకోవడం వల్ల కరోనా నుంచి విముక్తి పొందవచ్చా? ఈ విధంగా రెండు వేరు వేరు డోసులు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
రెండు వేరు వేరు రకాలకు చెందిన వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల స్వల్ప దుష్ప్రభావాలు ఏర్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొదటి డోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వేరే కంపెనీ చెందిన రెండో డోస్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ విధంగా రెండు వేరు వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను ఇవ్వగా కొందరిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి.
ఈ విధంగా రెండు రకాల డోస్ లు తీసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు ఓ అధ్యయనంలో భాగంగా తెలిపారు. అయితే ఈ లక్షణాలు ఎంతో ప్రమాదకరం కాదని, వీటివల్ల ఆస్పత్రికి చేరాల్సిన అవసరం కూడా లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేరు వేరు టీకాలు తీసుకోకూడదని నిబంధన లేనప్పటికీ,ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. ఒక వ్యక్తి మొదటి డోసు ఏ కంపెనీ కి చెందినది తీసుకుంటారో రెండవ డోసు కూడా అదే కంపెనీకి చెందినది తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…