ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియాలో సింగపూర్ వేరియంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సింగపూర్ వేరియంట్ మనదేశంలోకి వ్యాపిస్తే దాని ప్రభావం పిల్లలు ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కానీ సింగపూర్ వేరియంట్ అనేది అవాస్తవం అని అసలు నిజం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో షాక్ కి గురి అవుతారు అని చెప్పవచ్చు.
తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..సింగపూర్ వేరియంట్ వల్ల పిల్లలకు ఎక్కువగా కరోనా సోకే ప్రమాదం ఉందనీ, అందుకోసమే సింగపూర్ కి విమాన సర్వీసులను నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కోరారు. ఇప్పటికే పిల్లలతో థర్డ్ వేవ్ అధిక ప్రభావం చూపిస్తుందని, నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో తెరపైకి సింగపూర్ వేరియంట్పై భయంకరమైన ప్రచారం మొదలైంది. ఈ అంశంపై లోతుగా వెళ్తే… ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది..
సింగపూర్ వేరియంట్ అంటే B.1.617. చాలా మంది ఈ వేరియంట్ ఇండియలోకి వస్తే ఎంతో ప్రమాదకరం అని భావిస్తున్నారు.అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఇండియాలో తీవ్రరూపం దాలుస్తున్నటువంటి వేరియంట్ B.1.617. ఈ వేరియంట్ నే అనధికారికంగా ఇండియన్ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో వ్యాపిస్తున్న ఈ వేరియంట్ వల్ల పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నట్లు మనం చూస్తున్నాము.
ప్రస్తుతం ఈ వేరియంట్ సింగపూర్ లో కనిపించడం వల్ల సింగపూర్ ప్రభుత్వం నేటి నుంచి స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.ఈ విధంగా సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ప్రకటనతో కంగారుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రి ఈ విషయంపై చర్చించారు. ఇందులో నిజం ఏమిటంటే సింగపూర్ లో కన్నా ముందుగానే వేరియంట్ B.1.617 ఇండియాలో ఉందనేది వాస్తవం అని, ఈ వేరియంట్ మరింత మ్యుటేషన్ జరిగే థర్డ్ వేవ్ గా పిల్లల పై ప్రభావం చూపిస్తోందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఉన్నా లేకున్నా పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…