వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల చాలామంది శరీరంలో కూడా పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరికి చలికాలంలో కూడా శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం ద్వారా శరీరం పై పొక్కులు ఏర్పడటం, నోట్లో పుండ్లు ఏర్పడటం, చెమట కాయలు, ముక్కు ద్వారా రక్తం కారడం,తరచూ వళ్ళు వేడి అవుతూ జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే శరీరంలో అధిక వేడి వల్ల సతమతమయ్యేవారు వారి ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వేడిని కొంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు నీటి శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో పెరుగన్నం తప్పకుండా తీసుకోవాలి. వీలైతే ఒక గ్లాసు పలుచటి మజ్జిగను తాగడం ద్వారా శరీర వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే నీటిశాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీర దోసకాయ, దానిమ్మ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ఈ సమస్య తగ్గాలంటే నీటిలో మెంతుల పొడి వేసుకుని తాగటం ద్వారా మన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఈ వేడి ఉండటంవల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు చల్లటి గాలి తగిలే ప్రదేశాలలో ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ పద్ధతులన్నీ పాటించినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రం మార్పు రాకపోతే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…