Pavithra Lokesh: పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు.. తన మొదటి భర్తకు ఈమె మొదటి భార్య కాదా?
Pavithra Lokesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినపడుతున్న పేర్లలో నటి పవిత్ర లోకేష్ పేరు ఒకటి.ఈమె గత కొంత కాలం నుంచి సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తోందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.
నరేష్ పవిత్ర లోకేష్ కలిసి పలు సినిమాలలో నటించడం తో వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడి సహజీవనానికి దారితీసిందని తెలుస్తోంది.వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఈ జంట ఇంతవరకు ఏమాత్రం స్పందించలేదు. అదే విధంగా తాజాగా వీరిద్దరు మహాబలేశ్వరంలో జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వీరిద్దరికీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు ఆయన ఏం చేస్తుంటారనే విషయాల గురించి చర్చనీయాంశంగా మారింది. పవిత్ర లోకేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె తండ్రి కూడా మంచి నటుడే.అయితే ఈమె 9 వ తరగతిలో ఉన్న సమయంలో తండ్రి చనిపోవడంతో ఈమె కూడా కొద్ది రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా కన్నడ సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈమె సుమారు 20 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించారు. ఈ విధంగా సీరియల్స్ చేస్తున్న సమయంలో కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్రతో ప్రేమలో పడిన పవిత్ర తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. అయితే సుచేంద్రకు పవిత్ర మొదటి భార్య కాదు ఈయన 2002వ సంవత్సరంలో కన్నడ నటి మల్లికా ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు.2006 లో తనకు విడాకులు ఇచ్చి 2007వ సంవత్సరంలో పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల వీరిద్దరూ విడిపోయారు.అయితే ఇప్పటికీ ఈమెకు అధికారికంగా విడాకులు రాకపోవడంతో నటుడు నరేష్ ను పెళ్లి చేసుకోకుండా ఉన్నారని విడాకులు వచ్చిన అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినపడుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…