Home Minister: సన్నీలియోన్ పాటపై హోం మంత్రి సీరియస్..స్పందించిన మ్యూజిక్ కంపెనీ..!
Home Minister: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల నటించిన ఓ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె తాజా పాట ‘మధుబన్’ పాటలో.. బోల్డ్ దుస్తులలో ఆమె కనిపించగా.. మధురకు చెందిన పూజారులు సన్నీ లియోన్ పై మండిపడుతున్నారు. తాజా వీడియో ఆల్బమ్ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటి “మధుబన్ మే రాధిక నాచే” పాటలో “అశ్లీల” నృత్యం చేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదంటూ సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. అయితే ఈ పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. ప్రభుత్వం నటిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళ్తాం అని బృందాబన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు.
ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదంటూ హెచ్చరించారు. అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా ఈ పాటను నిషేధించాలని డిమాండ్ చేశాడు. ఇలా గత ఐదు రోజుల నుంచి ఆమె పాటపై.. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా స్పందించాడు. కావాలనే ఈ పాటలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. సన్నీలియోన్ తో పాటు.. పాటపాడిన వారు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆ వీడియోను తొలగించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోం మత్రి హెచ్చరికలతో వీడియోలోని కొన్ని పదాలను మార్చేందుకు సరిగమప మ్యూజిక్ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిసింది. మార్చిన పాటను అత్యంత త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది సరిగమప కంపెనీ.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…