Home Minister: సన్నీలియోన్ పాటపై హోం మంత్రి సీరియస్..స్పందించిన మ్యూజిక్ కంపెనీ..!
Home Minister: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల నటించిన ఓ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె తాజా పాట ‘మధుబన్’ పాటలో.. బోల్డ్ దుస్తులలో ఆమె కనిపించగా.. మధురకు చెందిన పూజారులు సన్నీ లియోన్ పై మండిపడుతున్నారు. తాజా వీడియో ఆల్బమ్ను నిషేధించాలని డిమాండ్ చేశారు.
బాలీవుడ్ నటి “మధుబన్ మే రాధిక నాచే” పాటలో “అశ్లీల” నృత్యం చేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదంటూ సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. అయితే ఈ పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. ప్రభుత్వం నటిపై చర్యలు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళ్తాం అని బృందాబన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు.
ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే జరిగే పరిణామాలకు మాకు సంబంధం లేదంటూ హెచ్చరించారు. అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా ఈ పాటను నిషేధించాలని డిమాండ్ చేశాడు. ఇలా గత ఐదు రోజుల నుంచి ఆమె పాటపై.. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా స్పందించాడు. కావాలనే ఈ పాటలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. సన్నీలియోన్ తో పాటు.. పాటపాడిన వారు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆ వీడియోను తొలగించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హోం మత్రి హెచ్చరికలతో వీడియోలోని కొన్ని పదాలను మార్చేందుకు సరిగమప మ్యూజిక్ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిసింది. మార్చిన పాటను అత్యంత త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది సరిగమప కంపెనీ.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…