Why Pawan Kalyan's photo? YCP objects to Yoga Day campaign!
విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నేతలు ఈ వేడుకలో పాల్గొనడంతో అది జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. నరేంద్ర మోదీ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని యోగా చేసిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
అయితే ఈ వేడుకలపై రాజకీయ చర్చలకూ తెరలేచింది. కార్యక్రమానికి సంబంధించి బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన పబ్లిక్ బ్యానర్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ఫొటోలు ఉండడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. “ప్రధాని మోదీ ఫొటో ఉన్న ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన్ను అనుసరించే రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రమే ఫొటోలో చూపించాలి. ఇతర మంత్రుల చిత్రాలు నిబంధనలకు విరుద్ధం” అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో దీనిపై మద్దతు, వ్యతిరేకతలు వినిపించాయి.
జగన్ మోహన్ రెడ్డి అభిమానులు పవన్ పై ఉన్న అసంతృప్తిని ఈ వివాదం మరోసారి బయట పెట్టినట్లైంది. పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం అనడం రాజ్యాంగబద్ధం కాదని తాము చెబుతున్నాం, కానీ ఆయన్ని బ్యానర్లలో ముఖ్యంగా చూపించడం మిగిలిన మంత్రులకే అవమానం అంటూ వైసీపీ వాదించింది. మరొవైపు జనసేన శ్రేణులు మాత్రం, “వైసీపీకి చంద్రబాబుపై కన్నా పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ కోపం. ఎందుకంటే ఎలక్షన్లలో వైసీపీని డౌన్ చేయడంలో కీలకపాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి” అని చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఈ ట్వీట్ చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు ఈ కార్యక్రమంపై మించిన దృష్టిని పొందాయి. ప్రజలు మాత్రం దీనిని సీరియస్గా తీసుకోవాలా? లేక రాజకీయ పద్ధతిలో చూస్తే సరిపోతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి?
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…