వివాహేతర సంబంధాల కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే.. మరికొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో.. అనుమానం పెనుభూతమై ఆమె పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు మధ్య అనుమానం తాండవించింది.
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానించి ఆమె ప్రైవేట్ భాగాలను సూది, దారంతో కుట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో 64 ఏళ్ల వృద్ధుడు, 55 ఏళ్ల వృద్దురాలు దంపతులు. కొన్నేళ్ల క్రిందట వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయ. తరచూ భార్యను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని.. వేధించేవాడు.
ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. దీనిలో భాగంగానే ఓ రోజు కోపంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్కు సూది, దారంతో కుట్లు వేశాడు. దీంతో ఆమె ఓ పోలీస్ అధికారికి సమాచారం అందించడంతో.. ఆమె భర్త చేసిన నీచమైన పని వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఆమె ప్రైవేట్ భాగాలకు వేసిన కుట్లను తొలగించారు.
భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోవడమే కాకుండా.. తన భర్తను అరెస్టు చేయవద్దని పోలీసులను వేడుకుంది సదరు మహిళ. పోలీసులు అతడిపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను ఇంతలా హింసించిన అతడు మనిషా.. లేదా పశువా.. అంటూ తెలిసిన వారు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…