General News

Telangana: ఫ్రీ బస్సు స్కీంను తెలంగాణ మహిళలు ఇలా వాడుతున్నారా… మామూలు వాడకం కాదుగా?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా తెలంగాణ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో మహిళల ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో మహిళలు ప్రయాణం చేస్తున్నారు. లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్యలో ఉందని అధికారులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ ఉచిత స్కీం ద్వారా మహిళలు ఏ ఏ ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నారా అనే విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఉచిత ప్రయాణం కావడంతో మహిళలందరూ కూడా ఎక్కువగా దైవ దర్శనాలకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు.

పుణ్యక్షేత్రాలకు ప్రయాణం…

ఈ పథకం డిసెంబర్ 9వ తేదీ అమలులోకి తీసుకువచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. 10వ తేదీ ఆదివారం రోజు 2,26,645 మంది మహిళలు ప్రయాణం చేశారు. 11వ తేదీ రెండు లక్షలకు పైగా ప్రయాణం చేశారు. ఇలా ప్రతిరోజు లక్షల సంఖ్యలోనే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

3 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

10 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

22 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago