Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రష్మిక ఎన్ని కోట్లు సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Rashmika: కన్నడ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో రష్మిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇటీవల అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవటంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ నిత్యం బిజీగా ఉంటోంది .టాలీవుడ్ లో ఈమె నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ కావడంతో ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
అన్నీ భాషలలోను టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు ఒక్కో సినిమాకి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. దీంతో హీరోయిన్ గా తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు కూడకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన సమయం నుండి రష్మిక 40 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్టు సమాచారం. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలో డబ్బుతో పాటు మంచి పాపులారిటీ కూడా సంపాదించుకుంది.
ప్రస్తుత రష్మిక తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమా సీక్వెల్ గా పుష్ప2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాలో చాన్స్ కొట్టేసి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతే కాకుండా అమితాబ్ బచ్చన్ తో కలిసి‘గుడ్ బై’ హిందీ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ.. బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…