Writer & director Kanagala Jayakumar : నెల్లూరుకి చెందిన రత్నకుమారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది. ఇక ఆమె చిన్నతనం గురించి ఆమె కుటుంబం గురించి రచయిత అలాగే దర్శకుడు అయిన కనగాల జయకుమార్ వివరించారు.
వాణిశ్రీ ఇంట్లో ఒకేరోజు మూడు మరణాలు…
వాణిశ్రీ గారిది నెల్లూరు కాగా చిన్నతనములోనే తండ్రి టీబి వ్యాధితో మరణించారు. అదే రోజు తన ఇద్దరు అక్కలు కూడా టీబి బారిన పడి మరణించడంతో క్రుంగిపోయింది ఆ కుటుంబం. వాణిశ్రీ తల్లి ఆమె వాణిశ్రీ దృష్టిని మరల్చదానికి చెన్నై తీసుకెళ్లి అక్కడ గేదెలను పెట్టుకుని పాల వ్యాపారం చేసారు. అలానే వాణిశ్రీ గారికి చదువుతో పాటు భరత నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఇక నాటక రంగ ప్రవేశం కూడా చేసిన వాణిశ్రీ గారు నాటకాలతో ప్రసిద్ధి చెందారు. ఆమె నటన చూసిన కొందరు దర్శక నిర్మాతలు సావిత్రి లాంటి అభినయం కనబడుతోందని ఆమెకు చిన్న చిన్న వేషాలను సినిమాల్లో ఇవ్వడం ప్రారంభించారని జయకుమార్ తెలిపారు.
ఇక ఆలా మొదలయిన ఆమె ప్రస్థానంలో దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, గంగ మంగ, కృష్ణవేణి వంటి మరుపు రాని చిత్రాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఆమె గడుసు తనంతో ఉన్న పాత్రలు చేయడం వల్ల నిజంగా కూడా ఆమె గర్విష్టి అనే ప్రచారం ఉండేది కానీ ఆమె చాలా బాగా అందరినీ గౌరవిస్తారు అంటూ చెప్పారు. తాను పుట్టిన ఊరి కోసం ఆమె స్కూల్ అలాగే హాస్పిటల్ కట్టించారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…