Yandamuri veerendranath: ప్రముఖ నవల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇకపోతే యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు యండమూరి కథ అందించడం ఆయన సినిమాలకు పలు సలహాలు సూచనలు చేసినట్లు పలు ఇంటర్వ్యూలలో సందర్భంగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా యండమూరి యువతలో ప్రోత్సాహాన్ని నింపుతూ ఎన్నో మోటివేషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.అయితే గతంలో యండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ ముఖకవళికలు గురించి కామెంట్ చేయడంతో చిరంజీవి బాధపడ్డారని దాంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి.కానీ మనస్పర్థలు రాలేదని రామ్ చరణ్ కామెంట్ చేసినందుకు చిరంజీవి బాధపడ్డారని తెలిసిందంటూ యండమూరి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇకపోతే నాగబాబు గారి విషయంలో కూడా కామెంట్ చేసినందుకు యండమూరి పట్ల మనస్పర్థలు వచ్చాయి. అలాగే ఒక సభాముఖంగా చిరంజీవి భార్య సురేఖ గారిని సురేఖ అని ఏక వచనంతో సంబోధించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ.. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి రావడం సర్వసాధారణం అయితే వాటిని రికార్డ్ చేసే టెలికాస్ట్ చేసే వాళ్ళు వేరే విధంగా ఫోకస్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి.అయితే రామ్ చరణ్ ను, చిరంజీవి భార్యను అలా అన్నందుకు నేను లెంపలు వేసుకోవాలా…అని యండమూరి ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయం గురించి ప్రస్తావించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…