Yedu Kondalu : జబర్దస్త్ వివాదంలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీనంతటికి మొదట ఆజ్యం పోసింది మాత్రం కిర్రాక్ ఆర్పినే. జబర్దస్త్ గురించి, మల్లె మాల గురించి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి తీవ్ర వాఖ్యలు చేసాడు. దీంతో జబర్దస్త్ నుండి కొంతమంది కిర్రాక్ ఆర్పి వాఖ్యలను ఖండించడానికి సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడు కొండలు కూడా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చి జబర్దస్త్ లో విషయాల గురించి కిర్రాక్ ఆర్పి గురించి సంచలన వాఖ్యలు చేసాడు.

శ్యామ్ గారి గురించి తప్పుగా మాట్లాడటంతో మెడ పట్టి బయటకు గెంటేసా…
కిర్రాక్ ఆర్పి చేసిన విమర్శలను ఏడు కొండలు తప్పుబట్టారు. అన్నం పెట్టిన సంస్థను తిట్టడం చాలా తప్పు అంటూ అన్నారు. ఒక సినిమా తీస్తున్నానని ఆ సినిమా కోసం మేనేజర్ గా పనిచేయమని అడిగితే వెళ్ళాను, నెలకు యాభైవేలు జీతం ఇస్తానని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఆర్పి తీరు నచ్చలేదు. ఈ సినిమా ముందుకు సాగదు అని అర్థమైంది దాంతో నేను మానేసాను.

అది కాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు దాంతో వాడిని మెడబట్టి బయటకు గేంటేసాను అంటూ ఏడుకొండలు చెప్పారు. ఇక జబర్దస్త్ లాంటి వేదిక మీద వీళ్లకు జీవితాలు మెరుగుపడ్డాయి. అలాంటిది కిర్రాక్ ఆర్పి లాంటి వాడు శ్యామ్ ప్రసాద్ గారిని తిట్టడని అంటూ ఫైర్ అయ్యారు ఏడు కొండలు. చివరకు మళ్ళీ జబర్దస్త్ మొఖం చూడాల్సిందే, వేరే చానెల్స్ కి వెళ్లినా ఎక్కువ రోజులు పని చేయలేరు అంటూ చెప్పారు.






























