Yemaya Chesave 2: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నాగచైతన్య జంటగా నటించిన చిత్రం ఏం మాయ చేసావే. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిన మనకు తెలిసిందే. సమంత మొట్టమొదటి సినిమాని బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది స్టార్స్ ప్రేమలో పడ్డారు.
ఇక ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్య మధ్య ప్రేమ ఏర్పడటం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం జరిగింది. ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి సమంత నాగచైతన్య కొన్ని కారణాలవల్ల విడిపోయారు. అయితే తాజాగా ఏం మాయ చేసావే సినిమా సీక్వెల్ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ గౌతమ్ మీనన్ ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ఈయన తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అనే కథాంశంతో స్క్రిప్ట్ సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కాకుండా సమంత స్థానంలో రష్మిక నటించబోతుందని తెలుస్తోంది. ఇలా రష్మిక ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం.ఏది ఏమైనా ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి సమంత నాగచైతన్య విడిపోవడం అందరిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక సినిమాలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు చూపించబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…