ఆంద్రప్రదేశ్ మంత్రాలయం ఆలయ భూముల బహిరంగ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ మఠం నిర్వాహకులు. ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసారు. 2017లోనే మఠం ఆలయ భూముల అమ్మకం ప్రారంభించామని, అయితే భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆలయ నిర్వాహకులు.

అయితే కరోనా నేపధ్యంలో కాస్త ఆలస్యమైందని, తాజగా నివర్ తుఫాను రాష్ట్రానికి సమీపిస్తున్న దృష్ట్యా రైతుల గురించి ఆలోచించి ఈ వేలం ప్రక్రియను కొద్దిరోజులు నిలిపివేస్తున్నట్టు ప్రకరించారు. ఈ వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.



























