దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖలు చేసారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వెనుకబాటుతనానికి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని, అయన నరరూప రాక్షసుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణలోని భూములు, ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అదే విదంగా అమయాకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, గ్రూప్ 1 పోస్టుల విషయంలోకూడా అయన అన్యాయం చేసారని విమర్శిచారు. దొంగను దొంగ అనకుండా దొర అంటారా అంటూ ప్రశ్నించారు. ఎపీతో ఎంత మంచిగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా ఏపీ సీఎం జగన్ మాత్రం అడ్డుపడుతున్నారని అన్నారు.































