ప్రభుత్వమే వ్యాక్సిన్ బాధ్యతను నిర్వర్తించాలన్న ఫార్ములాతో ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వం..ఏ రాష్ట్రమూ వేయని విధంగా ఏప్రిల్లో ఒకేరోజున 6.28 లక్షల మందికి టీకా వేసి తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఇపుడు ఆదివారం నాడు ఒకే రోజున 8 లక్షల మందికి టీకా వేసి.. టీకాల లభ్యత పెరిగితే ఎంత వేగంగా దాన్ని పూర్తిచేయగలమనేది మరోసారి చెప్పడానికి సిద్ధమయింది.

ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లూ ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది. ఈ డ్రైవ్లో ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు.



























