“నేను చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నాన.. త్వరలో చనిపోతానేమో..!! ” అంటున్నారు ప్రముఖ టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత ! “ప్రేమ” సినిమాలో మందులు పని చేయక హీరోయిన్ రేవతి చనిపోయినట్టుగా.. ఎదో ఒక రోజు నేను కూడా చనిపోతానని ఎప్పుడు తన స్నేహితురాలితో చెబుతుంటుందట. ఆ సినిమాలో హీరోయిన్లా ప్రతి దానికి ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాను. ఎదో ఒకరోజు మెడిసిన్ పని చేయకపోతే నేను చనిపోవడం ఖాయం అంటుంది ఈ భామ. తనకు మైగ్రేన్, తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు తనను భాదిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చింది ఈ హీరోయిన్ కామ్ పొలిటీషియన్.
తనీష్ నటించిన “నచ్చావులే” చిత్రంతో ఎవరూ ఊహించని విధంగా అద్భుమైన విజయం సాధించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది ఈ భామ. ఆ తరువాత నాచురల్ స్టార్ నాని నటించిన “స్నేహితుడు” చిత్రంలో కథానాయికగా నటించింది. అయితే ఆ తరువాత కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసినా పెద్ద అవకాశాలు కలిసి రాకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ లో చేరి, గుంటూరు వెస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకి దగ్గర గా ఉండే ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ భామ కామెంట్స్ అభిమానులంతా షాక్ అయ్యారు. ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి, కాస్త జాగ్రత్త వహిస్తే అవే తగ్గిపోతాయి అంతేగాని, ఆ మాత్రానికి చనిపోవడం ఏంటి అని కొందరు ఆమెకు ఓదార్పు మాటలు మాట్లాడుతున్నారు.





























