ఫేస్ బుక్ వాడకం రోజు రోజుకీ పెరిగిపోవడంతో… ఫేస్ బుక్ తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్పటి వరకు మనకు మెసేజ్ పోస్టులు, వీడియోలు షేర్ చేయడం వరకే పరిమితమైన ఫేస్ బుక్ లో ఇప్పుడు కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఓలెక్స్ తరహాలో వినియోగించిన వస్తువులను కొనడానికి.. అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది. ‘మార్కెట్ప్లేస్’ అనే పేరుతో ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ఇండియాలో ట్రయల్గా ముందు ముంబైలో చేపట్టింది. ఇది కానీ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయబోతుంది. ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ఓలెక్స్, క్వికర్ తరహాలో ఫేస్బుక్ కూడా ఈ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ 25 దేశాల్లో అందుబాటులో ఉంది.
ఇటీవలే ఈ ఫీచర్ ను జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి 17 దేశాల్లో దీన్ని ప్రారంభించారు. ఫేస్బుక్కు భారీ మొత్తంలో యూజర్ డేటాబేస్ ఉంది. ఈ క్రమంలో ఫేస్బుక్ తన పేజీలో మార్కెట్ ప్లేస్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్తో యూజర్లను మరింత మందిని ఆకట్టుకోనుంది. అందులోకి వెళ్లి మీరు అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వాటి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్ లేదా కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్, అప్పారెల్స్ వంటి అన్ని కేటగిరీ సంబంధించిన వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది. అయితే ఇందులో పేమెంట్కు, డెలివరీకి మాత్రం ఫేస్బుక్ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వాడుతున్నారు..