Connect with us

General News

సామాన్యులను బయపెట్టుస్తున్న మోడీ నిర్ణయం, బ్యాంకులు అలా చేస్తే మీ డబ్బు పాయినట్లే ..!ఎలానో తెలుసా …!

Published

on

భద్రంగా ఉంటుందని మీ సొమ్ము దాచుకున్న బ్యాంకే దివాలా తీస్తే..?? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లు మీ ఖాతాలోని సొమ్ముకు ప్రస్తుతమున్న భద్రత కూడా కరువయ్యేలా చేయనుందని ఆర్థికరంగ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పిల్లల చదువు కోసం… పెళ్లి కోసం… రిటైరయ్యాక శేష జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడపడం కోసం… రోగాలు వచ్చినా తట్టుకోవడం కోసం…ఇలా చాలా మంది బ్యాంకుల్లోనే డబ్బులు వేస్తారు. మరీ ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్లు చేస్తారు. వడ్డీ తక్కువ అయినా అసలుకు గ్యారెంటీ అని వారి నమ్మకం. ఎందుకంటే మనదేశంలో ప్రభుత్వ బ్యాంకులు అంటే జాతీయ బ్యాంకులు ఇంతవరకూ ప్రజల డబ్బును ఎగ్గొట్టిన చరిత్ర లేదు. కాని ఇప్పుడు ఓ ప్రమాకరమైన చట్టం చేసేందుకు మోఢీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రకారం మీరు డబ్బు దాచుకున్న బ్యాకు నష్టపోయినా, దివాళా తీసినా ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యతలేదు..

ఇది ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటు సెలక్ట్‌ కమిటీ పరిశీలనలో ఉంది. అది ఆమోదిస్తే వెంటనే కేబినెట్‌ క్లియర్‌ చేయాలి.. ఆ తరువాత వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఇప్పటి వరకు ఏదయినా జాతీయ బ్యాంకు దివాళాతీస్తే దానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉండేది. ప్రజల డబ్బు తిరిగి ఇచ్చేందుకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చేవారు. సో మనం డిపాజిట్ చేసుకున్న డబ్బుకు భారత ప్రభుత్వమే గ్యారెంటీ అన్నమాట. కాని ఇక నుంచి ఆ బ్యాంకుకు, అందులోని మీ డబ్బుకు నాకు ఎలాంటి గ్యారెంటీ లేదంటోంది కేంద్ర ప్రభుత్వం.


ఈ కొత్త చట్టం ప్రకారం ఓ కార్పొరేషన్ ఏర్పాటవుతుంది. బిల్లులో ఈ కార్పొరేషన్‌కు ఎంతగా తిరుగులేని అధికారాలు కట్టబెట్టారంటే.. దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్‌ రద్దు చేసేయవచ్చు. అంటే దీని అర్థం.. మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదు.అంతేకాదు ఈ కొత్త చట్టం ప్రకారం మనం పిల్ల పెళ్లికో లేక చదువుకో ఓ పది లక్షల రూపాయలను ఐదేళ్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామనుకుందాం. బ్యాంకువారు దానిని మన అనుమతి లేకుండానే 20 ఏళ్లకు డిపాజిట్ పిరియడ్ మార్చేయవచ్చు. అంటే ఏ అవసరం కోసం మీరు దాన్ని దాచుకున్నారో అవసరాన్ని తీర్చుకోవడానికి ఆ డబ్బు మనకు లభించదన్నమాట. సపోజ్ మనం 15 లక్షలు సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌లో దాచుకుంటే దానిని లక్ష రూపాయలకు మార్చేయవచ్చు. లేదా ఆ 15 లక్షల మొత్తాన్ని తమకు నచ్చినట్లు ఐదేళ్లకో లేక పదేళ్లకో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చేయవచ్చు. ఇలా చేయడానికి దేనికీ మీ అనుమతి అవసరంలేదన్నమాట మోఢీ ప్రభుత్వం తేబోతున్న కొత్త బిల్లు ప్రకారం..


ప్రస్తుతం మీ ఖాతాలోని సొమ్ములో లక్ష రూపాయల వరకు బ్యాంక్‌ బీమా కవరేజీ కల్పిస్తుంది. ఒకవేళ బ్యాంక్‌ దివాలా తీసినా రూ.లక్ష వరకైతే తిరిగి చేతికొస్తుంది. అంతకు మించి జమ చేసిన సొమ్ముకు మాత్రం ఎలాంటి భద్రత ఉండదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లుపై కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ముకు ఇప్పుడున్న భద్రత కూడా లేకుండా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, దివాలా తీసిన బ్యాంకు డిపాజిటర్ల సొమ్ముతో కొంత నష్టాలను పూడ్చుకునేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లులోని ‘బెయిల్‌ ఇన్‌’ ప్రొవిజన్‌ వీలుకల్పిస్తుంది. అయితే, బ్యాంకర్లు మాత్రం ఈ బిల్లు విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!