తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు గాంధీభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు కొత్తగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడు మలికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లు అతిథులుగా హాజరు కానున్నారు.

































