Connect with us

General News

డబ్బులు పంపించు రాత్రికి నీ దగ్గరకి వస్తా అంటూ facebook లో మెసేజ్ పెట్టాడు.. పాపం.. ఆ తరువాత చుడండి ..!!

Published

on

సోషల్ మీడియా … స్కూల్ కి,కాలేజీ కి వెళ్లి చదువు ఎంత నేర్చుకుంటున్నారో తెలీదు కానీ పక్క వాళ్ళను చూసి ఈ ఫేస్ బుక్,ట్విట్టర్ లాంటివి వాడటం చాలా మందే నేర్చుకున్నారు ,అయితే ఈ సోషల్ మీడియా వాడటం అయితే మొదలు పెట్టారు కానీ అది ఎలా వాడాలి అన్న దాని మీద కనీస జ్ఞానం కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయి కనపడితే చాలు హాయ్ డియర్ నైస్ పిక్ అంటూ మొదలెట్టేస్తారు,అయితే ఆలా చేయడం వల్ల వాళ్ళ పరువు పోగొట్టుకోడమే కాదు మన దేశం పరువు కూడా పోగొడుతున్నారు అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, దేశం పరువు పోవడం ఏంటా అనుకుంటున్నారా ఒకసారి ఈ ప్రబుద్దుడు చేసిన పని చూడండి,ఎలా మన దేశం పరువు తీసాడో …

అతని పేరు అనిల్, పాపం నాలుగు ఇంగిలీషు ముక్కలు మాట్లాడటం వచ్చు అనుకుంటా,దానికి తోడు ఫేస్ బుక్ అకౌంట్ కూడా ఉంది,ఇంక అతన్ని ఆపేదెవరు చెప్పండి,పేస్ బుక్ మీద పడిపోయాడు,కనపడిన ప్రతి అమ్మాయిని కెలకడం మొదలెట్టేసాడు,అతనికి పొరపాటున ఒక బ్రిటిష్ యువతి ఫేస్ బుక్ లో కనపడింది,ఫారిన్ పిల్ల కదా వారికి ఇవన్నీ మామూలే అనుకున్నాడో లేక అతను నవ మన్మధుడు అనుకున్నాడేమో వెంటనే ఆమెకు మెసేజ్ చేసి ఐ లవ్ యు,నాతో సెక్స్ చేస్తావా అంటూ సిగ్గు లేకుండా ప్రవర్తించడం మొదలు పెట్టాడు,అయితే ఆమె కోపం తెచ్చుకోకుండా అతనికి సంయమనంతో రిప్లై ఇస్తూ అతనితో కామెడీ గా ఆదుకోవడం మొదలు పెట్టింది. అనిల్ అని ఉన్న అతని పేరుని యానల్ ( అంటే ఏంటో చెప్పక్కర్లేదు అనుకుంటా ) అని మార్చేసింది,ఆమె అలా కామెడీ చేస్తున్న అర్ధం కాలేదనుకుంటా అతని మట్టి బుర్రకి మల్లి సిగ్గు లేకుండా నేను నీ దగ్గరకి రావళి అనుకుంటున్నాను నాకు 500$ డబ్బులు పంపించు నీ దగ్గరకి వస్తా అంటూ ఆమెను డబ్బులు అడగడం మొదలు పెట్టాడు.అయితే ఆమె సరే నేను డబ్బులు ఇస్తా కానీ నువ్వు ఫేస్ బుక్ లో ఐ అం యానల్ ఫ్రొం యానస్ అని స్టేటస్ పెట్టు అని అడిగింది,అయితే అది చేయడానికి కూడా అతను సిగ్గు పడలేదు,అలా ఆ విదేశీ యువతి ముందు మన దేశం పరువు తీసేసాడు,ఆమె అతనితో చేసిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసిరి అతని పరువుని తీసింది.మీరే చూడండి అతగాడి భాగోతం… మీకు ఇంగ్లీష్ పాఠాలు ఏమైనా నేర్పిస్తాడేమో నేర్చుకోండి కుదిరితే.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!