ప్రముఖ నటులు ఉర్వశి శారద అస్వస్తత గురైయినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారిజామున అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. .పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో సినిమాలో బాలనటిగా తెరగ్రెటం చేశారు. ఆ తరువాత ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించారు శారద. హీరోయిన్గా ప్రముఖ నటుల సరుసన నటించి మెప్పించారు.

తెనాలి పార్లమెంట్ నుంచి ఎంపీగా కూడా శారద పనిచేశారు. 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా శారద తొలి సారిగా ‘ఊర్వశి’ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడో సారి జాతీయ ఉత్తమ నటిగా నిలచారు





























